Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కెప్టెన్సీలో లోపమున్నట్లు భావించట్లేదు: రవిశాస్త్రి

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (15:31 IST)
ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో దారుణ వైఫల్యం తర్వాత టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. వన్డే సిరీస్‌ సన్నాహకాల్లో భాగంగా భారత్‌ శుక్రవారం మిడిలెసెక్స్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి ఐదు వన్డేల సిరీస్‌కు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని మహేంద్ర సింగ్ ధోనీ సేన కృతనిశ్చయంతో ఉంది. 
 
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తాచాటాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక వామప్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ ధోనీ ఆడే అవకాశాలు కన్పించడం లేదు. వివిధ విన్నింగ్‌ కాంబినేషన్లు పరీక్షించాలని ధోనీ భావిస్తున్నాడు. దీంతో యువ కీపర్‌ శాంసన్‌కు అవకాశం దక్కనుంది. కాగా గురువారం కూడా టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. 
 
సహాయ కోచ్‌లు పెన్నీ, డేవ్స్‌ పర్యవేక్షణలోనే భారత్‌ నెట్‌ ప్రాక్టీస్‌ చేసింది. కొత్త సిబ్బంది ఇంకా జట్టుతో చేరలేదు. కాగా, కెప్టెన్‌గా ధోనీనే కొనసాగాలని టీమిండియా డైరెక్టర్‌గా నూతనంగా నియమితులైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నాడు. 
 
ధోనీకి ఇదోక కఠినమైన సమయమని తెలిపాడు. అయితే తాను ధోనీ కెప్టెన్సీలో లోపం ఉన్నట్లుగా భావించడం లేదని చెప్పాడు. ధోనీ టీం సభ్యులను ముందుండి నడిపించాలని భావిస్తున్నప్పటికీ.. ఇతర ఆటగాళ్లు గాడిన పడటం లేదని రవి శాస్త్రి అన్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments