Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి పద్మభూషణ్, కోహ్లీకి పద్మశ్రీ అవార్డు!

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (17:29 IST)
భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి పద్మభూషణ్, యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, హైదరాబాదీ మిథాలీ రాజ్ పేరును కూడా పద్మశ్రీకి నామినేట్ చేసింది.
 
ధోనీకి 2009లో పద్మశ్రీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఒక వేళ ధోనీకి పద్మభూషణ్ అవార్డును ప్రకటిస్తే.. ఈ అవార్డు అందుకున్న క్రికెటర్లలో ధోనీ పదో ఆటగాడు అవుతాడు. ధోనీ సారథ్యంలో భారత జట్టు ప్రపంచ ట్వంటి20, ప్రపంచ వన్డే ఛాంపియన్‌‌‌గా నిలిచిన విషయం తెలిసిందే.
 
కాగా, 25 ఏళ్ల విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో రాణించకపోయినా.. 134 వన్డే ఇంటర్నేషనల్స్‌లో 5,634 పరుగులు సాధించడం, 25 అంతర్జాతీయ సెంచరీలను నమోదు చేయడం ద్వారా అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభతో పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments