Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్న మహేళ జయవర్ధనే!

Webdunia
మంగళవారం, 12 ఆగస్టు 2014 (16:13 IST)
శ్రీలంక క్రికెట్ మూలస్తంభాల్లో ఒకడిగా పేరుగాంచిన మహేళ జయవర్ధనే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. గురువారం నుంచి పాకిస్థాన్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ చివరి మ్యాచ్ కానుంది. 
 
ఇటీవలే టి20 వరల్డ్ టైటిల్ గెలిచిన అనంతరం మినీ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పిన ఈ మాజీ కెప్టెన్, తాజాగా టెస్టు బరి నుంచి తప్పుకోనుండడంతో లంక క్రికెట్ ఫ్యాన్స్ విచారంలో మునిగిపోయారు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిస్థాయిలో తప్పుకునే అవకాశాలున్నాయి. 
 
కాగా, ప్రపంచ క్రికెట్లో వన్డేలు, టెస్టుల్లో 11 వేలకు పైగా పరుగులు సాధించిన ఐదుగురు క్రికెటర్లలో మహేల ఒకడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్, కుమార సంగక్కర ఉన్నారు. ఇప్పటివరకు 148 టెస్టులాడిన మహేల 50.02 సగటుతో 11,756 పరుగులు చేశాడు. వాటిలో 34 సెంచరీలు, 49 అర్థసెంచరీలు ఉన్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments