Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు కూడా దూరమైన ఇషాంత్ శర్మ!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (11:30 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే మూడో టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన ధోనీ సేనకు.. ఆ ఓటమి బాధ నుంచి తేరుకోక ముందే మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. సౌతాంఫ్టన్ టెస్ట్ మ్యాచ్‌కు దురమైన ఇషాంత్ శర్మ.. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగే మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. 
 
ఇషాంత్ ఇంకా మడమ గాయం నుంచి కోలుకోలేదని కెప్టెన్ ధోనీ మీడియాతో చెప్పాడు. ఓల్డ్ ట్రాఫర్డ్ మ్యాచ్‌కు అతను ఫిట్నెస్ సాధించలేడన్న విషయం రూఢీ అయిందని, ఈ విషయంపై చర్చించాల్సి ఉందని తెలిపాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఇషాంత్ ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయడం తెలిసిందే. 
 
అయితే, గాయం కారణంగా మూడో టెస్టుకు దూరం కాగా, అతని స్థానంలో జట్టులోకొచ్చిన రాజస్థాన్ పేసర్ పంకజ్ సింగ్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో ధోనీ ఎవరిని బరిలో దింపుతాడన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇషాంత్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు కూడా దూరం కావడమంటే.. ఖచ్చితంగా మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments