Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌: శ్రీనివాసన్‌కు సంబంధం లేదన్న సుప్రీం!

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (17:18 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్‌ ఫిక్సింగ్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించింది. బెట్టింగ్‌లో ఐసీసీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు సంబంధం లేదని ధర్మాసనం తెలిపింది. శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌, రాజ్‌కుంద్రా ఫ్రాంచైజీ కో ఓనర్లే అని తేల్చిచెప్పింది. 
 
శ్రీనివాసన్‌కు బెట్టింగ్‌తో సంబంధం లేకపోయినా ఆయన అల్లుడు గురునాథ్‌కు ప్రమేయం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి 17 నెలల తర్వాత ధర్మాసనం తీర్పును వెలువరించింది. తద్వారా గత ఏడాదిన్నర నుంచి కొనసాగుతున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌కు క్లీన్ చిట్ లభించింది.
 
ఈ కేసులో శ్రీనిపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని, సాక్ష్యాలతో రుజువుకాలేదని పేర్కొంది. జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా కోర్టు 130 పేజీలతో తీర్పు వెలువరించింది. 
 
మరోవైపు ఇదే సమయంలో శ్రీనివాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఈ మాజీ అధ్యక్షుడిని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించాలని బోర్డును ఆదేశించింది. అటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ నుంచి ఉద్వాసన పలికింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments