Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌‌తో మూడో టెస్ట్ : ఓటమి అంచున భారత్!

Webdunia
గురువారం, 31 జులై 2014 (10:45 IST)
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో విజయభేరీ మోగించిన భారత క్రికెట్ జట్టు ఇపుడు సౌతాంప్టన్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి కోరల్లో చిక్కుకుంది. మూడో టెస్టులో విజయానికి 445 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. 
 
లక్ష్య ఛేదనలో ఇప్పటికే విజయ్‌ (12), ధవన్‌ (37), పుజారా (2), కోహ్లీ (28) వికెట్లను భారత్‌ త్వరత్వరగా కోల్పోయింది. భారత్ ఈ మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కాలంటే రహానె, రోహిత్‌ శర్మ, కెప్టెన్‌ ధోనీలతో పాటు టెయిలెండర్లు కూడా అసాధారణంగా పోరాడాల్సిందే! లేకపోతే.. ఈ మ్యాచ్‌లో ఓటమి ఖాయం. 
 
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 239 పరుగులు భారీ ఆధిక్యం చేతిలో ఉంచుకుని, భారత్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్... ఓ ప్రణాళిక ప్రకారం వేగంగా ఆడింది. అలిస్టర్‌ కుక్‌ (70 నాటౌట్‌), రూట్‌ (56) రాణించడంతో.. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఫలితంగా 445 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments