ఐదు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లలో ఇరు జట్లూ ఒక్కో మ్యాచ్ గెలవగా, తుఫాను కారణంగా విశాఖలో జరగాల్సిన మూడో వన్డే మ్యాచ్ రద్దు అయిన విషయం తెల్సిందే. దీంతో శుక్రవారం ధర్మశాల వేదికగా జరిగే నాలుగో వన్డే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
సీరిస్ను కైవసం చేసుకోవాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్గా మారిన ధర్మశాల వన్డేలో టీమిండియా చెమటోడ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు తొలి వన్డేలో అద్భుతంగా రాణించి, రెండో వన్డేలో చతికిలబడ్డ విండీస్ జట్టు కూడా నేటి వన్డేలో పుంజుకుని సిరీస్లో ముందంజ వేసేందుకు యత్నిస్తోంది. ఇక ధర్మశాల బౌన్సీ పిచ్పై ఎవరు ఆధిక్యం సాధిస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.