Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కోణపు సిరీస్ : శిఖర్ ధావన్ అనవసరపు షాట్‌కు అవుట్!

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (12:21 IST)
ట్రై-సిరీస్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసిన అనంతరం 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అనవసరపు షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. 
 
ఇప్పటికే వరుస వైఫల్యాలతో పేలవ ఫామ్ కనబరుస్తున్న ధావన్ ఈ మ్యాచులోనూ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 8 పరుగులు చేసిన ధావన్ స్టార్క్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయానికి భారత స్కోరు 6 ఓవర్లకు 24 పరుగులు.
 
అనంతరం 23 పరుగులు చేసిన అంబటి రాయుడు మార్ష్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 64 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. కాగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురియడంతో ఈ మ్యాచును 44 ఓవర్లకు కుదించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments