ఇంగ్లండ్తో జరుగనున్న మూడో టెస్టు కోసం టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఐదుగురు బౌలర్ల వ్యూహం తొలి రెండు టెస్టుల్లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో... టీమిండియా మూడో టెస్టు కోసం ప్రణాళికలు మారుస్తోంది.
నలుగురు బౌలర్లు, ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్ మెన్తో బరిలోకి దిగాలని భావిస్తోంది.
ఈ క్రమంలో, బౌలర్గా తొలి రెండు టెస్టుల్లో విఫలమైన స్టువర్ట్ బిన్నీని తప్పించి, రోహిత్ శర్మను మూడో టెస్టు కోసం తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
రోహిత్ శర్మ కూడా నెట్స్లో ప్రాక్టీసు జోరు పెంచాడు. దీంతో, రోహిత్ మూడో టెస్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ ధావన్ ప్లేస్లో గంభీర్ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.