ఇంగ్లండ్ గడ్డ భారత జట్టు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్ గడ్డపై మరోసారి టెస్టు సిరీస్ కోల్పోకూడదని పట్టుదలగా ఉంది. ఇప్పటికే సిరీస్లో 1-2తో వెనుకబడ్డ ధోని బృందం నేటినుంచి ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగే చివరిదైన ఐదో టెస్టుకు సమాయాత్తమైంది.
సిరీస్ను కనీసం ‘డ్రా’గా ముగించాలన్నా... ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడం తప్పనిసరి. మరోవైపు మ్యాచ్ను కనీసం ‘డ్రా’ చేసుకోగలిగినా సిరీస్ను గెలుచుకునే స్థితిలో ఇంగ్లండ్ ఉంది. ఆటగాళ్ల ఫామ్తో పాటు తుది జట్టు కూర్పు వరకు టీమిండియా సమస్యల్లో ఉండగా... కుక్ సేన మాత్రం వరుస విజయాలు ఇచ్చిన జోరుతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.