Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతలో ధోనీకి చుక్కెదురు: కేసు కొట్టివేతకు కోర్టు నో!

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (14:02 IST)
అనంతపురంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చుక్కెదురైంది. తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనంతపురం కోర్టులో వేసిన పిటీషన్‌ను కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో హిందువుల పవిత్రదైవంగా భావిస్తున్న శ్రీ మహావిష్ణువు అవతారంలో నటించడాన్ని వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. ఈనెల 7లోపు ధోనిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
 
కాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ.. ఆయన తరఫున ఢిల్లీకి చెందిన న్యాయమూర్తి పంకజ్ బజ్లా సోమవారం అనంతపురం కోర్టు ముందు హాజరై పిటీషన్ దాఖలు చేశారు. అయితే దీనిని పరిశీలించిన ధర్మాసనం పిటీషన్‌ను తోసిపుచ్చింది. పిటీషనర్ సంతకం అసలైంది కాదని, కోర్టు భావించినట్లుగా ప్రతివాద న్యాయవాది గోపాల్ రావు తెలిపారు.
 
కొద్ది రోజుల క్రితం ధోని ఓ వాణిజ్య ప్రకటన కోసం మహావిష్టువు అవతారంలో నటించి చేసిన కామెంట్లపై మనస్తాపం చెందిన విశ్వ హిందూపరిషత్ ఉపాధ్యక్షుడు వై. శ్యాంసుందర్ ధోనికి వ్యతిరేకంగా అనంతపురం కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments