Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్: 408 పరుగులకు టీమిండియా ఆలౌట్!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (11:22 IST)
బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 408 పరుగులకు ఆలౌటైంది. 311/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ చివరి 6 వికెట్లను త్వరితగతిన చేజార్చుకుంది. రోహిత్ శర్మ 32, కెప్టెన్ ధోనీ 33, అశ్విన్ 35 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో పేసర్ హాజెల్ ఉడ్‌కు 5 వికెట్లు దక్కాయి. ఆఫ్ స్పిన్నర్ లియాన్ 3 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
 
కాగా అంతకుముందు బ్రిస్బేన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్ మురళీ విజయ్ (144) సెంచరీ సాధించగా, వరుసగా రెండో టెస్టులోనూ శిఖర్ ధావన్ (24) నిరాశపరిచాడు. ఛటేశ్వర్ పుజారా(18) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. 
 
తొలి టెస్టులో రెండు సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ (19) రెండో టెస్టులో విఫలమయ్యాడు. అజింక్యా రహానే (75), రోహిత్ శర్మ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్ బౌలర్ జోష్ హాజెల్ ఉడ్ రెండు వికెట్లు తీయగా, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments