Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయుడి బిర్యానీ తినడానికి ధోనీ హోటల్ మారాడు!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (12:41 IST)
ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో భాగంగా హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ లీగ్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు గ్రాండ్ కాకతీయ హోటల్లో బస చేశారు. ధోనీతో సన్నిహితంగా మసలే యువ బ్యాట్స్ మన్ అంబటి రాయుడు ఈ సందర్భంగా భారత కెప్టెన్‌కు హోమ్లీ ఆతిథ్యం ఇవ్వాలని భావించాడు. 
 
ధోనీ కోసమని తన ఇంట్లో బిర్యానీ చేయించి, దాన్ని కాకతీయ హోటల్‌కు పట్టుకొచ్చాడు. అయితే, కాకతీయ హోటల్ నిబంధనలు మరోలా ఉన్నాయి. అక్కడ బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతించరట. ఇదే విషయాన్ని హోటల్ సిబ్బంది రాయుడికి చెప్పగా, రాయుడు ఈ సంగతి ధోనీకి వివరించాడు. దీంతో, ఒళ్ళు మండిన ధోనీ వెంటనే హోటల్ షిఫ్ట్ అవుతున్నట్టు స్పష్టం చేసి... తాజ్ కృష్ణాకు మకాం మార్చాడట. ధోనీ నిర్ణయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా సమర్థించినట్టు సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments