Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రకటన వాయిదా

Webdunia
ఇంగ్లాండ్ సెలెక్టర్లు జట్టు జాబితాకు సంబంధించిన ప్రకటనను వాయిదా వేశారు. మే 6న లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టును రేపు ప్రకటించాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు గాయాల బారి నుండి తిరిగి కోలుకుంటుండటంతో వారికి మరింత సమయాన్ని అనుమతించే ప్రక్రియలో భాగంగా జట్టు ప్రకటనను ఇంగ్లాండ్ సెలెక్టర్లు వాయిదా వేశారు.

వాస్తవానికి ఏప్రిల్ 20న జట్టును ప్రకటించాల్సి ఉండగా.. సెలెక్టర్ జెఫ్ మిల్లర్ ఆదేశం మేరకు ఏప్రిల్ 29 వరకు జట్టు ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అదలా ఉంచితే మోచితి గాయం నుంచి ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

అయితే ముందస్తుగా మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఇయాన్ బెల్ పేర్లను కూడా ఈ టెస్ట్ స్క్వాడ్‌లో సెలెక్టర్లు చేర్చడం గమనార్హం. లండన్‌లో మిల్లర్ విలేకరులతో మాట్లాడుతూ, ఆటగాళ్ల జాబితా ప్రకటనను వాయిదా వేయాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలిపాడు. జట్టు ఎంపిక ఆలస్యం అయితే బాగుంటుందని తాము కూడా భావించామని వివరించాడు. దీని వల్ల ఒక చక్కటి అవకాశం చేజారి పోకుండా ఉంటుందని పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments