Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : రసవత్తర పోటీకి వేళైంది... భారత్ వర్సెస్ కివీస్

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (09:55 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రసవత్తర పోటీకి సమయం ఆసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఈ పోటీలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. 12 యేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకునేందుకు భారత్ ఒక్క అడుగు దూరంలో ఉంది. అయితే, న్యూజిలాండ్ కూడా అంతే బలంగా ఉంది. దీంతో ఈ అంతిమ పోరు రెండు సమ ఉజ్జీలైన జట్ల మధ్య అమితాసక్తికరంగా సాగనుంది. 
 
అయితే, ప్రత్యర్థి జట్టును ఓడించాలంటే భారత కుర్రోళ్లు మరింతగా శ్రమించాల్సివుంది. ఐసీసీ ట్రోఫీలలో భారత్‌పై కివీస్‌కు 10-6 ఆధిక్యం ఉండటం గమనార్హం. ఇదే నాకౌట్ మ్యాచ్‌లలో ఆ జట్టు లక్ష్యం 3-1గా ఉంది. మరోవైపు అన్ని మ్యాచ్‌లలోనూ దుబాయ్‌లో ఆడటం వల్ల అదనపు ప్రయోజనం పొందుతోందంటూ క్రికెట్ ప్రపంచంలో ఓ వర్గం కోడై కూస్తోంది. 
 
ఈ మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ఉపయోగిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూపు దశ మ్యాచ్ జరిగిన పిచ్‌పైనే ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. పిచ్ మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుంది. పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. 270-280 పరుగులు చేసినా మంచి స్కోరే అవుతుంది. ఈ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌లోల సగటు స్కోరు 246గా ఉంది. 
 
తుది జట్ల మంచనా... 
భారత్ : రోహిత్ శర్మ, గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, షమి, వరుణ్ చక్రవర్తి.
 
న్యూజిలాండ్ : విల్ యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్, జేమీసన్, హెన్రీ లేదా డఫి, ఒరూర్క్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

తర్వాతి కథనం
Show comments