Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరారే వన్డే : భారత్ 271/8... జింబాబ్వే విజయలక్ష్యం 272

Webdunia
ఆదివారం, 12 జులై 2015 (16:54 IST)
హరారే వేదికగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు పర్యాటక జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రహానే 63, మురళీ విజయ్ 72 పరుగులతో రాణించి ఓపెనింగ్ భాగస్వామ్యంగా 112 పరుగులు జోడించారు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అంబటి రాయుడు 41, మనోజ్ తివారీ 22, కీపర్ ఊతప్ప 13, స్టువర్ట్ బిన్నీ 25, జాదవ్ 16, హర్భజన్ 5 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 13 రన్స్ వచ్చాయి. దీంతో భారత్ 50 ఓవర్లలో 5.42 రన్‌రేట్‌తో 271 పరుగులు చేసింది. 
 
జింబాబ్వే బౌలర్లలో మెజ్డివ నాలుగు వికెట్లు తీయగా, విటోరి, తిరిపనో, చిబాబా, సికిందర్ రాజాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆ తర్వాత జింబాబ్వే జట్టు 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టింది. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తొలి వన్డేలో గెలుపొందిన విషయం తెల్సిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం