రవిశాస్త్రి, కోహ్లీ పెట్టిన యోయో టెస్టే నా కొంపముంచింది.. యువరాజ్ సింగ్

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (14:52 IST)
టీమిండియాలో చోటు కోల్పోవడానికి యోయో టెస్టే కారణమని, దాంట్లో పాస్ కాలేకపోవడం వల్లే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశానని స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. అయితే, ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉంటే మాత్రం తన పరిస్థితి వేరేలా ఉండేదని, తన క్రికెట్ కెరీర్‌ను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చేది కాదని యువరాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 
 
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్‌ కోహ్లీ హయాంలోనే యోయో టెస్టును ప్రారంభించడాన్ని యువరాజ్ సింగ్ పరోక్షంగా విమర్శించాడు. క్రికెటర్ బాగా ఆడుతుంటే ఆ టెస్టుతో పనేంటని నిలదీశాడు. సౌరవ్ గంగూలీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఆటగాళ్ల అవసరాలను అర్థం చేసుకునే విజయవంతమైన సారథి అని కితాబిచ్చాడు. గంగూలీని తాను దూరదృష్టి గలవాడిగా భావిస్తున్నాను. 
 
అతను దేశవాళీ క్రికెట్ స్థితిని కూడా మెరుగుపరచగలడని తాను ఆశిస్తున్నానని యువరాజ్ సింగ్ తెలిపాడు. కాగా, కేన్సర్‌ ను జయించి క్రికెట్‌లోకి మళ్లీ వచ్చాక యువీ యోయో టెస్ట్‌ పాస్‌ కాలేదంటూ జట్టులోకి తీసుకోలేదన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Software engineer: ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే టైల్ ముక్క వచ్చింది.. (video)

బీహార్ వలస కార్మికులను తమిళనాడు సర్కారు వేధిస్తోందా?

సెలైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని మార్కెట్‌లో సంచారం...

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

తర్వాతి కథనం
Show comments