Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో భారత్‌కు ఓటమి తప్పదా? కివీస్ టార్గెట్ 139

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (19:27 IST)
ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో భారత క్రికెట్ జట్టు ఓటమి దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. రిజర్వు డే అయిన ఆరో రోజున టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ మినహా మిగిలిన వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం కేవ‌లం 170 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 
 
న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 32 ప‌రుగుల ఆధిక్యం ల‌భించ‌డంతో ఆ టీమ్ ముందు కేవ‌లం 139 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మాత్రం ఉంచింది. బౌల‌ర్లు స‌మ‌ష్టిగా రాణించ‌డంతోపాటు కేన్ విలియ‌మ్స‌న్ అద్భుత‌మైన కెప్టెన్సీ ముందు ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ నిల‌వ‌లేక‌పోయారు. 
 
టాప్‌, మిడిలార్డ‌ర్ దారుణంగా విఫ‌ల‌మైంది. రిష‌బ్ పంత్ మాత్రమే 41 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయితే అత‌డు కూడా కీల‌క‌మైన స‌మ‌యంలో చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. కివీస్ బౌల‌ర్ల‌లో సౌథీ 4, బౌల్ట్ 3, జేమీస‌న్ 2, వాగ్న‌ర్ 1 వికెట్ తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments