ఒక చెడు రోజు.. ఒక చెత్త సెషన్ మా కొంప ముంచింది : రవిశాస్త్రి

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (16:59 IST)
ఇటీవల ముగిసిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఒక చెడు రోజు.. ఒక చెత్త సెషన్ మాకు శాపంగా మారింది. ఇదే తమకు అతి  పెద్ద పరాభవం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
టీమిండియాకు మళ్లీ ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ క్రికెట్ కప్‌లో లీగ్‌ దశలో కేవలం ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయినా టాప్‌లో నిలిచాం. కానీ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పోరాడి ఓడిపోయాం. కేవలం 30 నిమిషాల ఆటే మమ్మల్ని వెనక్కి నెట్టిందన్నారు. 
 
నా గత రెండేళ్ళ కోచింగ్‌ కెరీర్‌లో అది పెద్ద పరాభవం. ఒక చెడు రోజు, ఒక చెత్త సెషన్‌ మాకు శాపంగా మారింది అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. 'తదపరి రెండేళ్లలో రెండు ఐసీసీ టోర్నమెంట్‌లు ఉన్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్‌షిప్‌ మొదలైంది. 2021లో టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ రెండింటికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ మేరకు సన్నద్ధం కావడమే నా ముందున్న లక్ష్యమని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments