వన్డే వరల్డ్ కప్లో భాగంగా పూల్-బీలో భారత్తో శనివారం జరుగుతున్న మ్యాచ్లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ జట్టులో శిఖర్దావన్, రోహిత్శర్మ, విరాట్కోహ్లీ, రహానే, రైనా, మహేంద్రసింగ్ ధోనీ, జడేజా, అశ్విన్, భువనేశ్వర్కుమార్, ఉమేశ్యాదవ్, మోహిత్శర్మ ఉన్నారు.
యూఏఈ జట్టులో అంజద్ అలీ, బెరెంజర్, కృష్ణాచంద్రన్, ఖుర్రంఖాన్, పాటిల్, అన్వర్, రోహన్ ముస్తఫా, అంజద్ జావేద్, మహ్మద్ నవీద్, తాకీర్, గురుగేలు ఉన్నారు. యూఏఈ ఆడిన రెండు మ్యాచ్ల్లో జింబాబ్వేపై 285 పరుగులు, ఐర్లాండ్పై 278 పరుగులు చేసింది. కాగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు వరుస మ్యాచ్ల్లో ఓడించిన భారత్ పూల్-బీ అగ్రస్థానంలో కొనసాగుతుంది.