Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ఐపీఎల్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్.. కరోనా కాలంలో సూపర్ క్రికెట్ టోర్నీ

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (14:14 IST)
మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా కష్ట కాలంలో ఈ ఏడాది లీగ్‌ జరుగుతుందా లేదా అనే అనుమానాలను బీసీసీఐ పటాపంచలు చేసింది. నవంబరు 1 నుంచి 10 వరకు యూఏఈలోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. చాలెంజర్‌ సిరీస్‌ పేరిట ఈ టోర్నీ జరుగనుంది. 
 
మహిళల టోర్నీలో గతేడాదిలాగే మూడు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీ కన్నా ముందే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న మహిళా క్రికెటర్లకు శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ షెడ్యూల్‌ మధ్యలో చాలెంజర్‌ సిరీస్‌ను జరుపుతాం. అలాగే కరోనా వైరస్ కారణంగా జాతీయ క్రికెట్‌ శిబిరం మూతబడింది కాబట్టి మహిళల ఐపీఎల్‌ కన్నా ముందే వారికి శిబిరం ఏర్పాటు చేస్తామని సౌరవ్ గంగూలీ చెప్పారు. 
 
యూఏఈలో మహిళల ఐపీఎల్‌నూ నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయం పట్ల భారత మహిళల వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచకప్‌ కోసం మా సన్నాహం ఎట్టకేలకు ఆరంభం కానుంది. బీసీసీఐ, సౌరవ్ గంగూలీ, జై షాలకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ కూడా బీసీసీఐ బాస్ గంగూలీ, బీసీసీఐలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

విద్యార్థులు - టీచర్ల మధ్య శృంగారం సహజమే... విద్యార్థికి లేడీ టీచర్ లైంగిక దాడి..

Rabies: తను రక్షించిన కుక్కపిల్ల కాటుకే గిలగిలలాడుతూ మృతి చెందిన గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ ఆటగాడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

తర్వాతి కథనం
Show comments