Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో వన్డే: శతక్కొట్టిన వార్నర్, మిషెల్ మార్ష్.. భారత్ విజయలక్ష్యం 331 పరుగులు

Webdunia
శనివారం, 23 జనవరి 2016 (14:59 IST)
భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలోనూ కంగారూలు తమ సత్తా ఏంటో నిరూపించారు. బ్యాట్లు ఝళిపించారు. టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. ముందుగా టాస్ గెలిచిన ధోనీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తద్వారా తొలుత బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల పతనానికి 330 పరుగులు సాధించింది.

తొలి ఓవర్ నుంచే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శించారు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ 122 పరుగులతో విజృంభించాడు. ఓపెనర్ అరోన్ పించ్ (6), స్టీవ్ స్మిత్ (28), జార్జి బెయిలీ (6), షాన్ మార్ష్ (7) వెంట వెంటనే పెవిలియన్ క్యూ కట్టారు. 
 
అయితే షాన్ మార్ష్ తర్వాత వచ్చిన మిషెల్ మార్ష్ (101) కూడా శతకంతో బ్యాట్ ఝళిపించాడు. మార్ష్‌కు మాథ్యూ వేడ్ (36) చక్కని సహకారంతో పర్వాలేదనిపించాడు. అయితే, చివర్లో వచ్చిన జేమ్స్ ఫాల్కనర్ (1), జాన్ హేస్టింగ్ (2)లు వెంటవెంటనే వెనుదిరగడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు సాధించింది. తద్వారా భారత్‌కు 331 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించినట్లైంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, బుమ్రా చెరో రెండేసి, ధావన్, యాదవ్ చెరొక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments