Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీసేనకు కరోనా షాక్‌ - డేనియెల్‌ సామ్స్‌కు పాజిటివ్‌

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:47 IST)
మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ప్రారంభంకానుంది. ఇందుకోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే, ఈ సమరానికి ఆయా ఫ్రాంచైజీలకు చెందిన జట్లు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అయితే ఈ టోర్నీని కరోనా వైరస్‌ వెంటాడుతోంది. తాజాగా మరో ఆటగాడికి కొవిడ్‌-19 సోకింది. ఆల్‌రౌండర్‌ డేనియెల్‌ సామ్స్‌కు పాజిటివ్‌ అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించింది.
 
ఆస్ట్రేలియా ఆటగాడైనా డేనియెల్‌ సామ్స్‌ ఏప్రిల్‌ 3న నెగెటివ్‌ రిపోర్టుతో బెంగళూరు శిబిరానికి చేరుకున్నాడు. అతడికి చేసిన రెండో పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. వెంటనే బీసీసీఐ కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం అతడిని ఐసోలేషన్‌కు పంపించామని ఆర్‌సీబీ తెలియజేసింది. 
 
కఠినమైన ఆంక్షలను పాటిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం సామ్స్‌కు ఎలాంటి లక్షణాలు లేవంది. తమ వైద్య బృందం నిరంతరం అతడిని పర్యవేక్షిస్తోందని, బీసీసీఐతో సహకరిస్తోందని ట్వీట్‌ చేసింది.
 
ఐపీఎల్‌కు మరో రెండురోజుల సమయమే ఉన్న నేపథ్యంలో ఇతర జట్ల ఆటగాళ్లు కరోనా బారినపడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అక్షర్‌ పటేల్‌, బెంగళూరులోనే దేవదత్‌ పడిక్కల్‌కు పాజిటివ్‌ వచ్చింది. మళ్లీ నెగెటివ్‌ రావడంతో పడిక్కల్‌ శిబిరంలోకి వచ్చేశాడు. 
 
కోల్‌కతా ఆటగాడు నితీశ్‌ రాణె కొవిడ్‌ నుంచి కోలుకొని జట్టుతో కలిశాడు. ముంబై ఇండియన్స్‌ సలహాదారు కిరణ్‌ మోరెకు సోమవారమే వైరస్‌ సోకింది. అలాగే, ప్రారంభ మ్యాచ్ జరిగే ముంబైలోని వాంఖడే మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో వైరస్‌ సోకింది. అంతేకాకుండా మ్యాచులను ప్రసారం చేసే స్టార్‌స్పోర్ట్స్‌ సిబ్బందిలో చాలామందికి పాజిటివ్‌ రావడంతో మ్యాచులపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments