Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధును చంపేసిన సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా : సెహ్వాగ్

బడాబాబులు దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలా దేశాన్ని నిలువునా దోచుకోవడంలో ఆ ఇద్దరు మోడీలు, ఒక మాల్యాను మంచినవారు లేరు.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (14:40 IST)
బడాబాబులు దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలా దేశాన్ని నిలువునా దోచుకోవడంలో ఆ ఇద్దరు మోడీలు, ఒక మాల్యాను మంచినవారు లేరు. వారు ఎవరో కాదు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా. ఈ ముగ్గురు కలిసి రూ.50 వేల కోట్లకుపైగా దోచుకున్నారు. 
 
ఇలాంటివారు విదేశాల్లో హాయిగా నిద్రపోతున్నారు. కానీ, ఆకలి కోసం చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసిన వాళ్ల‌ని మాత్రం జ‌నాలు చంపేస్తున్నారు. ఆక‌లి వేసి ఓ కేజీ బియ్యం దొంగ‌తనం చేసినందుకు మధు అనే వ్య‌క్తిని ఇటీవ‌ల దారుణంగా గాయ‌ప‌రిచి చంపేసిన విష‌యం తెలిసిందే. కొంత‌మంది విద్యావంతులు కూడా మ‌ధును ర‌క్షించ‌క‌పోగా.. గాయాల‌తో ఉన్న అత‌నితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
 
తాజాగా ఈ ఘ‌ట‌న‌పై సెహ్వాగ్ అస‌హ‌నం వ్య‌క్తంచేశాడు. మ‌ధును చంపేసిన స‌మాజంలో ఉన్నందుకు సిగ్గుప‌డుతున్నాంటూ ట్వీట్ చేశాడు. 'మ‌ధు కేవ‌లం ఒక కేజీ బియ్యం దొంగిలించాడు. అందుకే ఆ పేద గిరిజ‌న వ్య‌క్తిని ఉబైద్‌, హుస్సేన్‌, క‌రీమ్ అనే వ్య‌క్తుల‌తో కూడిన గుంపు చంపేసింది. ఇది స‌మాజానికి మాయ‌ని మ‌చ్చ‌. ఇంత ఉన్నత స‌మాజంలో ఈ ఘ‌ట‌న జ‌రిగినందుకు నేను సిగ్గుప‌డుతున్నాన‌ు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments