Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధును చంపేసిన సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా : సెహ్వాగ్

బడాబాబులు దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలా దేశాన్ని నిలువునా దోచుకోవడంలో ఆ ఇద్దరు మోడీలు, ఒక మాల్యాను మంచినవారు లేరు.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (14:40 IST)
బడాబాబులు దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలా దేశాన్ని నిలువునా దోచుకోవడంలో ఆ ఇద్దరు మోడీలు, ఒక మాల్యాను మంచినవారు లేరు. వారు ఎవరో కాదు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా. ఈ ముగ్గురు కలిసి రూ.50 వేల కోట్లకుపైగా దోచుకున్నారు. 
 
ఇలాంటివారు విదేశాల్లో హాయిగా నిద్రపోతున్నారు. కానీ, ఆకలి కోసం చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసిన వాళ్ల‌ని మాత్రం జ‌నాలు చంపేస్తున్నారు. ఆక‌లి వేసి ఓ కేజీ బియ్యం దొంగ‌తనం చేసినందుకు మధు అనే వ్య‌క్తిని ఇటీవ‌ల దారుణంగా గాయ‌ప‌రిచి చంపేసిన విష‌యం తెలిసిందే. కొంత‌మంది విద్యావంతులు కూడా మ‌ధును ర‌క్షించ‌క‌పోగా.. గాయాల‌తో ఉన్న అత‌నితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
 
తాజాగా ఈ ఘ‌ట‌న‌పై సెహ్వాగ్ అస‌హ‌నం వ్య‌క్తంచేశాడు. మ‌ధును చంపేసిన స‌మాజంలో ఉన్నందుకు సిగ్గుప‌డుతున్నాంటూ ట్వీట్ చేశాడు. 'మ‌ధు కేవ‌లం ఒక కేజీ బియ్యం దొంగిలించాడు. అందుకే ఆ పేద గిరిజ‌న వ్య‌క్తిని ఉబైద్‌, హుస్సేన్‌, క‌రీమ్ అనే వ్య‌క్తుల‌తో కూడిన గుంపు చంపేసింది. ఇది స‌మాజానికి మాయ‌ని మ‌చ్చ‌. ఇంత ఉన్నత స‌మాజంలో ఈ ఘ‌ట‌న జ‌రిగినందుకు నేను సిగ్గుప‌డుతున్నాన‌ు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments