Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ కాదు.. ట్రిపుల్ సెంచరీ చెయ్యవయ్యా.. కోహ్లీ-మయాంక్ సైగల వీడియో వైరల్

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (10:48 IST)
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సైగలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ మ్యాచ్‌ ఇండోర్‌లో జరుగుతోంది.

గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 58.3 ఓవర్లకే కుప్పకూలిన బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌటైంది. తదనంతరం బరిలోకి దిగిన టీమిండియా జట్టులో రోహిత్ శర్మ 6 పరుగులకు, విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. 
 
పుజారా అర్థ సెంచరీతో వెనుదిరగగా, మయాంక్ మైదానంలో మాయాజాలం చేశాడు. డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. తద్వారా టెస్టు కెరీర్‌లో మూడో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ-మయాంక్ సైగలు చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మయాంక్ మైదానంలో టంబ్, బ్యాటునెత్తి చూపెట్టగా.. కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఐదువేళ్లను చూపెట్టాడు. 
 
50 పరుగులతో డబుల్ సెంచరీ కొట్టాల్సిన రెండు చేతి వేళ్లను కూడా చూపెట్టాడు. ఇందుకు ఓకే అన్నట్లు టంబ్ చూపెట్టాడు మయాంక్. డబుల్ సెంచరీతో తర్వాత రెండు శతకాలు కొట్టానని రెండు వేళ్లు చూపెట్టాడు మయాంక్. మీరు చెప్పింది చేసేశాను అన్నట్లు మయాంక్ సైగలున్నాయి. అంతటితో ఆగకుండా విరాట్ కోహ్లీ మూడు చేతివేళ్లను చూపెట్టి ట్రిబుల్ సెంచరీ చేయాల్సిందిగా కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

Beijing : పుతిన్‌తో భేటీ అయిన కిమ్ జోంగ్- రష్యా ప్రజలకు నేను ఏదైనా చేయగలిగితే?

నేనెక్కడికెళ్తే నీకెందుకురా, గు- పగలకొడతా: మద్యం మత్తులో వున్న పోలీసుతో యువతి వాగ్వాదం (video)

Atchannaidu: ఉల్లిరైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అచ్చెన్నాయుడు

కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీలను పీకి రోడ్డుపై పారేస్తున్న భారాస కార్యకర్తలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

తర్వాతి కథనం
Show comments