Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీని ఓదార్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. జెర్చీని బహుకరించిన కోహ్లీ

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (17:11 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సమరం ముగింది. ఆదివారం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో భావోద్వేగ సన్నివేశాలు నెలకొన్నాయి. మైదానంలో విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓదార్చారు. ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్‌కు కోహ్లీ తన జెర్సీని బహుమతిగా అందజేశాడు.
 
మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ వద్దకు వచ్చిన మ్యాక్స్‌వెల్ ఆత్మీయంగా మాట్లాడారు. ఓటమి బాధలో ఉన్న కోహ్లీని ఓదార్చాడు. అంతేకాకుండా కోహ్లీ నుంచి గుర్తుగా ఓ జెర్సీని కూడా తీసుకున్నాడు. ఈ ఎమోషన్ మూమెంట్స్‌ను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
కాగా, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండటం తెలిసిందే. ఐపీఎల్‌లో పలు జట్లకు ఆడిన మ్యాక్స్‌వెల్ 2021 నుంచి ఆర్బీసీ తరపున ఆడుతున్నాడు. బెంగుళూరు జట్టుకు మారిన తర్వాత అతని ఆటతీరులో కూడా మార్పు వచ్చి స్థిరంగా రాణిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments