Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (21:31 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్‌లో భాగంగా, గురువారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ అరుదైన ఫీట్‌ను సాధించాడు. అంతర్జాతీయ టీ20 చరిత్రలో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 42 పరుగులు చేసిన  తర్వాత ఈ ఘనత సాధించాడు. 
 
అంతర్జాతీయ టీ20 పురుషుల పోటీల్లో అత్యధిక పరుగుల వీరుడు కోహ్లీనే కావడం గమనార్హం. ఇప్పటివరకు 115 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 52.74 సగటుతో 134.97 స్ట్రైక్ రేటుతో మొత్తం 4,008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీలు ఉన్నాయి. 
 
ఈ మైలురాయిని అందుకున్నవారిలో కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ, మార్టిన్ గుప్తిల్, బాబర్ అజామ్, పాల్ స్టిర్లింగ్, ఆరోన్ పింఛ్, డేవిడ్ వార్నర్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్, జోస్ బట్లర్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments