Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్ గడ్డపై మూడో సిరీస్ కైవసం.. విరాట్ కోహ్లీ హ్యాపీ హ్యాపీగా ట్వీట్!

విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తద్వారా విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్‌‌ని దక్కించుకుంది. కోహ్లీ సారథ్యంలో ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. శ్రీ

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2016 (11:55 IST)
విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తద్వారా విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్‌‌ని దక్కించుకుంది. కోహ్లీ సారథ్యంలో ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుసగా సిరీస్‌లు నెగ్గి హాట్రిక్ విజయాలను అందించిన కెప్టెన్‌గా నిలిచాడు.

గతంలో 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్.. నాలుగు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కోహ్లీ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకునేందుకు కోహ్లీ ట్వీట్ చేశాడు. 
 
టీమిండియా బస్సులో ప్రయాణిస్తుండగా దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. జట్టు చాలా అద్భుతంగా రాణించి గెలుపును నమోదు చేసుకుందని ట్వీట్ చేశాడు. అంతకుముందు స్యామీ స్టేడియంలో ముగిసిన మూడో టెస్టులో 237 పరుగుల భారీ తేడాతో భారత్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments