Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేశ్ రైనా బంధువులపై దోపిడీ.. మోస్ట్ వాంటెడ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (19:55 IST)
టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా బంధువులు దోపిడీ దొంగల దాడిలో మృతి చెందిన ఘటన మూడేళ్ల క్రితం ఐపీఎల్ సందర్భంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రైనా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. పంజాబ్‌లోని థరియాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రైనా మామయ్య అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపీడీ దొంగలు దాడి చేసారు. ఈ ఘటనలో అశోక్ కుమార్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, కుమారులు ఆస్పత్రి పాలయ్యారు. 
 
కుమారుడు కౌశల్ చికిత్స పొందుతూ మరణించగా, భార్య, మరో కుమారుడు కోలుకున్నారు. ఈ కేసులో నిందితుడైన రషీద్‌ను పోలీసులు మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు.
 
గత మూడేళ్లుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో యూపీలో రషీద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. రషీద్ పోలీసులపై దాడికి యత్నించడంతో, ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

తర్వాతి కథనం
Show comments