తనకు భారత దేశమన్నా, భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నా చాలా ఇష్టమని అందుకే తన కుమార్తెకు ఇండియా అనే పేరు పెట్టినట్లు దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ తెలిపారు. ముంబయిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో విలువలకు ముచ్చటపడే తన కుమార్తెకు ఇండియా పేరు పెట్టానన్నాడు.
భారత్లో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఏదో కొత్త విషయం ఉంటుంది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు అద్భుతం. ఆధ్యాత్మికత, ముందుచూపు రెండూ ఉన్న దేశం ఇది''అని వివరించాడు జాంటీ. ఇటీవలే జన్మించిన తన కుమార్తెకు ఇండియా జీన్ రోడ్స్ అని అతడు పేరు పెట్టిన విషయం తెలిసిందే.