Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా, ప్రపంచకప్‌లకు టీమిండియా ఎంపిక: కెప్టెన్ కూల్ ధోనీనే సారథి!

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (14:25 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ఆసియా కప్, ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్‌‌లలో ఆడే 15 సభ్యులతో కూడిన  భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పవన్ నేగి, బెంగాల్ పేసర్ మొహమ్మద్ షమీకి స్థానం దక్కింది. ఇక ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లలో ఆడే టీమిండియా జట్లకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే నాయకత్వం వహించనున్నాడు.
 
ఈ రెండు క్రికెట్ సిరీస్‌లకు ధోనీనే కెప్టెన్సీ వహించనున్నట్లు చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. రెండు సిరీస్‌లకు ఒకే జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శ్రీలంకతో ట్వంటీ-20 సిరీస్‌ ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ప్రారంభం కానుండగా, ఆసియా కప్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6వ తేదీ వరకు జరుగనున్నాయి. 
 
జట్టు వివరాలు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, అజింక్యా రెహానే, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పవన్ నేగి, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, మొహ్మద్ షమీ, బుమ్రా, పాండ్యా. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments