Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ అభిమానులకు ఓ చేదువార్త.. రిటైర్డ్ హర్ట్‌గా రోహిత్ శర్మ

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (17:03 IST)
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మూడో మ్యాచ్ నుంచి భారత అభిమానులకు ఓ చేదువార్త కూడా వచ్చింది.
 
కాగా, భారత జట్టు 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‌కు వచ్చాడు. 5 బంతులు ఆడి ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. మొత్తంగా 11 పరుగులు చేసిన తర్వాత కొంత ఇబ్బంది పడుతూ కనిపించాడు. వైద్య బృందం మైదానానికి వచ్చి రోహిత్ శర్మను పరీక్షించారు. దీంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు.  
 
రోహిత్ వెన్నులో ఏదో సమస్య ఉంది. కండరాల ఒత్తిడికి సంబంధించిన ఫిర్యాదు కూడా ఉంది. రోహిత్‌కు ఆరోగ్యం బాగోకపోవడంతో రిటైర్‌మెంట్‌ తీసుకుని వైద్య బృందంతో కలిసి డకౌట్‌కు వెళ్లాడు. దీంతో బీసీసీఐ రోహిత్ గాయంపై అప్‌డేట్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని బీసీసీఐ తెలిపింది. వైద్య బృందం ఆయనను పరీక్షిస్తోందని పేర్కొంది.
 
ఒకవేళ గాయం తగ్గినా.. ఆసియా కప్‌ 2022 నేపథ్యంలో బీసీసీఐ హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయం తీవ్రత పెరిగితే.. కీలక టోర్నీగా పరిగణించిన ఆసియా కప్‌ 2022కు రోహిత్ శర్మ దూరం అయ్యే ఛాన్స్ ఉంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments