Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఆప్ఘన్ వర్సెస్ కివీస్ : మ్యాచ్‌ ఫలితంపై భారత్‌ ఆశలు

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (13:45 IST)
దుయాబ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లోభాగంగా, ఆదివారం ఆప్ఘనిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితం కోసం భారత క్రికెట్ జట్టు కోటి ఆశలతో ఎదురు చూస్తుంది. 
 
సాధారణంగా ఈ మ్యాచ్‌పై ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ, ఇందులో వచ్చే ఫలితం కోసం కోట్లాది భారత అభిమానులు ఆతృతగా ఎదురుచూడబోతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ గెలిస్తేనే భారత జట్టుకు సెమీస్‌ అవకాశం ఉంటుంది. 
 
అప్పుడు అఫ్ఘాన్‌, కివీస్‌, భారత్‌ (నమీబియాతో విజయంతో)కు సమానంగా ఆరు పాయింట్లుంటాయి. కానీ అందరికంటే ఎక్కువ నెట్‌రన్‌రేట్‌ కలిగిన కోహ్లీ సేన సెమీస్‌లో అడుగుపెడుతుంది. అందుకే ఎలాగైనా కివీస్‌పై నబీ సేన గెలిచి మన జట్టుకు దారి చూపాలని కోరుకుంటున్నారు. 
 
కానీ పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా సెమీస్‌కు వెళుతుంది. ఇదే జరిగితే భారత్‌ ఆశలు ఆవిరై, నమీబియాతో జరిగే చివరి మ్యాచ్‌ నామమాత్రమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

తర్వాతి కథనం
Show comments