Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా భారత మాజీ స్పిన్నర్

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (08:34 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టరుగా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అలాగే, సెలక్షన్ కమిటీ సభ్యుడిగా మాజీ పేస్ బౌలర్ హర్వీందర్ సింగ్‌ను ఎంపిక చేశారు. 
 
కాగా, సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్ ఎంపిక విషయమై క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం సమావేశమైంది. ఈ సమావేశానికి సీఏసీ సభ్యులు మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్, సులక్షణా నాయక్‌లు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూకు సునీల్ జోషి, మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, ఎల్.ఎస్.శివరామకృష్ణన్, రాజేష్ చౌహాన్, హర్వీందర్ సింగ్ హాజరు కాగా, వీరిలో సునీల్ జోషిని చీఫ్ సెలెక్టరుగా ఎంపిక చేశారు. 
 
సీఏసీ సిఫారసుల మేరకు సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ పేర్లను బీసీసీఐ ప్రకటించింది. కాగా, త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం సునీల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది. ఈ పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టును ఇప్పటికే ఎంపిక చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

బంగారు నగల్లో వాటా ఇవ్వాల్సిందే లేదా చితిపై తల్లి శవంతో పాటు నన్నూ కాల్చేయండి (Video)

వల్లభనేని వంశీకి తీరని కష్టాలు.. బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తర్వాతి కథనం
Show comments