Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక మహిళా క్రికెట్‌లో లైంగిక వేధింపులు: జట్టులో ఉండాలంటే.. ఆ సుఖం..?

Webdunia
శనివారం, 23 మే 2015 (12:19 IST)
శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు కలకలం సృష్టించాయి. జాతీయ జట్టులో ఉండాలంటే తమకు సెక్స్ సుఖం అందించాల్సిందేనని కొందరు బోర్డు అధికారులు మహిళా క్రికెటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టగా, నివ్వెరపరిచే నిజాలు బయటపడ్డాయని దేశ క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జ్ నిమల్ దిసనాయకే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఆరోపణలు నిజమని తేల్చింది. శ్రీలంక జాతీయ మహిళా జట్టులోని చాలామంది క్రికెటర్లు ఈ వేధింపుల బారినపడ్డారని కమిటీ పేర్కొంది. తప్పు చేసినవారిపై కఠినచర్యలు ఉంటాయని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. కమిటీ సమర్పించిన నివేదికలో తగిన ఆధారాలు ఉన్నాయని తెలిసింది. 
 
ఇకపోతే శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 1-3 తేడాతో పరాజయం పాలయ్యింది. అయినప్పటికీ వరల్డ్ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్స్‌తో శ్రీలంక మహిళా జట్టు తలపడింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం