Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌: శ్రీలంక వేదికగా దాయాదుల పోరు

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2015 (12:56 IST)
భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పై ఎట్టకేలకు అనిశ్చితి తొలగిపోయింది. సుదీర్ఘకాలంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌కు శ్రీలంక వేదిక కానుంది. ఈ మేరకు శ్రీలంక వేదికగా భారత్-పాకిస్థాన్ సిరీస్‌కు బీసీసీఐ, పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

ఈ క్రికెట్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 27వ తేదీన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు జరపాలని బీసీసీఐ, పీసీబీ నిర్ణయించాయి. అయితే ఈ సిరీస్‌లకు వేదికగా యూఏఈని ఎంచుకుందామన్న పీసీబీ వాదనకు బీసీసీఐ అంగీకరించలేదు. 
 
అలాగే భారత్‌లో సిరీస్ నిర్వహిద్దామన్న బీసీసీఐ ప్రతిపాదనకు పీసీబీ కూడా సమ్మతించలేదు. దీంతో ఇరు బోర్డుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో శ్రీలంక వేదికగా సిరీస్ నిర్వహణకు ఇరు బోర్డులు దాదాపుగా ఓకే చెప్పేశాయని తెలుస్తోంది.

అయితే ఈ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ముందనుకున్న ప్రకారం రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు ట్వంటీ-20లు కాకుండా కేవలం మూడు వన్డేలు, రెండు ట్వంటీ-20లతోనే సిరీస్‌ను నిర్వహించేందుకు ఇరు బోర్డుల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments