Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ పోరు: భారత్-వెస్టిండీస్‌ల మధ్య ఢీ!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (17:06 IST)
భారత్, వెస్టిండీస్ మధ్య అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఖరారైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో వెస్టిండీస్ జట్టు జయకేతనం ఎగురవేయడంతో ఆ జట్టు ఫైనల్‌కి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 226 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టులో స్ప్రింగర్ (59) రాణించడంతో 48.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. 
 
దీంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విండీస్ జట్టు ఫైనల్లో దూసుకెళ్లింది. టోర్నీలో టైటిల్ ఫేవరేట్ భారత జట్టు ఇప్పటికే ఫైనల్‌లో అడుగుపెట్టిన సంగతి విదితమే. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 14న ఫైనల్ ఫైట్ జరుగనుంది.
 
కాగా ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ సెమీఫైనల్లో శ్రీలంక జట్టుపై గెలిచిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మ్యాచులో అన్మోల్ ప్రీత్ సింగ్(72), సర్ఫరాజ్ ఖాన్(59)లు లంకను 97 పరుగుల తేడాతో ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఐదోసారి భారత్ ప్రపంచ కప్ ఫైనల్లో చేరిన జట్టుగా రికార్డు కెక్కింది. 2000, 2008, 2012లలో భారత్ అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలను దక్కించుకుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments