Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య క్రికెట్ సిరీస్: షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

Webdunia
సోమవారం, 27 జులై 2015 (19:32 IST)
దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య జరుగనున్న క్రికెట్ సిరీస్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయని బీసీసీఐ తెలిపింది. తొలి టెస్టు నవంబర్ 5న మొహాలీలో ప్రారంభం కానుండగా 9న ముగియనుంది. రెండో టెస్టు నవంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు బెంగళూరులో జరుగనుంది. 
 
మూడో టెస్టు నవంబర్ 25 నుంచి 29 వరకు నాగ్ పూర్‌లో ఆడనున్నారు. నాలుగో టెస్టును ఢిల్లీలో డిసెంబర్ 3 నుంచి 7 వరకు జరగనుంది. నాలుగేళ్ల విరామం తరువాత సఫారీ జట్టు భారత్‌లో సిరీస్ ఆడనుండడం విశేషం. కాగా, సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జట్టును ప్రకటించనున్నారు.
 
ఇకపోతే ట్వంటీ-20 సిరీస్ అక్టోబర్ రెండో తేదీ ధర్మశాలలో, అక్టోబర్ ఐదో తేదీన రెండో టీ-20 కటక్‌లోనూ, అక్టోబర్ 8వ తేదీన కోల్ కతా మూడో ట్వంటీ-20 జరుగుతుంది. అలాగే వన్డే సిరీస్ అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 25 వరకు జరుగనుంది. తొలి వన్డే కాన్పూర్, రెండో వన్డే ఇండోర్, మూడో వన్డే రాజ్ కోట్, నాలుగో వన్డే చెన్నై, ఐదో వన్డే ముంబై వేదికలుగా జరుగనున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments