Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో కరోనా కలకలం - పలువురు క్రికెటర్లకు పాజిటివ్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (10:01 IST)
ఈ నెల ఆరో తేదీ నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ జట్టుతో ఆడే భారత క్రికెట్ జట్టును కూడా ఇటీవల బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. అయితే, భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. పలువరు క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత ఆటగాళ్లలో ముగ్గురు కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధవాన్, రుతురాజ్ గ్వైకాడ్, శ్రేయాస్ అయ్యర్‌లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే, నైట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా కరోనా బారినపడ్డాడు. మరో ముగ్గురు సహాయక సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకింది. 
 
కాగా, వెస్టిండీస్ జట్టుతో ఈ నెల 6వ తేదీన టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఇది భారత క్రికెట్ జట్టుకు 1000వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక వన్డే మ్యాచ్‌కు భారత్‌కు ముందు కరోనా షాక్ తగలడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం జట్టు సభ్యులంతా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

11వ నంబర్ సీటే ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడింది!

Hyderabad: రైలు పట్టాలపై కుమార్తె సూసైడ్.. కాపాడటానికి వెళ్లిన తండ్రి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

తర్వాతి కథనం
Show comments