Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ అంటే పిచ్చి.. గ్రౌండ్‌లోనే తుదిశ్వాస విడిచిన క్రికెటర్

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (13:29 IST)
అతనికి క్రికెట్ అంటే అమితమైనపిచ్చి. అందుకే చిన్న వయసు నుంచి క్రికెట్ ఆడుతూ వచ్చాడు. విద్యార్థి దశలోనూ, ఉద్యోగం చేస్తున్నా, వివాహం చేసుకుని, పిల్లలకు తండ్రి అయినా కూడా తనకు క్రికెట్‌పై ఉన్న పిచ్చి మాత్రం పోలేదు. చివరకు అదే క్రికెట్ మైదానంలో తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. క్రికెట్ ఆడుతూ ఓ క్రికెట్ గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బాలాజీ నగర్‌కు చెందిన వీరేందర్ నాయక్ అనే క్రికెటర్‌‌కు రెండు నెలల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ క్రికెట్‌కు దూరంగా ఉండలేక పోయాడు. వైద్యులు సూచన చేసినప్పటికీ పెడచెవిన పెట్టాడు. 
 
ఈ నేపథ్యంలో క్రికెట్‌కి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సూచించారు. అయినప్పటికి అతడు బ్యాట్ పట్టకుండా, గ్రౌండ్‌లోకి దిగకుండా ఉండలేకపోయాడు. ఆదివారం ఈస్ట్‌ మారేడుపల్లి జీహెచ్‌ఎంసీ మైదానంలో ఎంపీ స్పోర్టింగ్‌, ఎంపీ‌బ్ల్యూస్‌ జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో ఎంపీబ్ల్యూస్‌ జట్టు తరపున బ్యాట్ పట్టాడు. 
 
చాలాసేపు బ్యాటింగ్ చేసిన వీరేందర్ నాయక్ 55 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కానీ అప్పటికే అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై.. అమాంతం కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది, తోటి ఆటగాళ్లు హుటాహుటిన సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు.. తోటి క్రికెటర్లు బోరున విలపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments