Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవం

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (14:57 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన బోర్డు సర్వసభ్య సమావేశంలో ఆయనను బీసీసీఐ సభ్యలంతా ఎన్నుకున్నారు. 
 
గత నెల 20న బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా హఠాన్మరణంతో అధ్యక్ష పదవి ఎన్నిక తప్పనిసరి అయింది. దీంతో ఈ పదవి కోసం మాజీ బాస్‌లు శ్రీనివాసన్, శరద్ పవార్‌లు పోటీపడినప్పటికీ.. చివరి నిమిషంలో తప్పుకున్నారు. 
 
దీంతో శశాంక్ మనోహర్ మరోమారు బీసీసీఐ పగ్గాలను స్వీకరించారు. ఈయన విజయం కోసం బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాగూర్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌లు గట్టిగా కృషి చేశారు. వీరికి బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా మద్దతు పలికారు. 
 
ఇదిలావుండగా, నూతన అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ నేతృత్వంలో కూడా సంస్కరణలు కొనసాగుతాయని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. బోర్డులో ఆరు నెలల క్రితం చేపట్టిన సంస్కరణలను కొసాగించాల్సిన అవసరం ఉంది. గతంలో అధ్యక్షుడిగా పని చేసిన మనోహర్‌ అందరి మన్ననలు అందుకున్నారు. దాల్మియా కాలంలో చేపట్టిన సంస్కరణలు నూతన అధ్యక్షుడి హయాంలో కూడా కొనసాగుతాయ ప్రకటించారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments