Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ సిక్సర్ల మోత.. షాకైన సారా టెండూల్కర్.. వీడియో వైరల్

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (21:17 IST)
Sara Tendulkar
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపిఎల్ 2024 మ్యాచ్‌లో వెటరన్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కేవలం నాలుగు బంతుల్లో 20 పరుగులు చేశాడు.  ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు బంతులు మిగిలి ఉండగానే ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. 
 
అయితే అతను హార్దిక్ పాండ్యాను బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్‌లతో కొట్టాడు. ధోని ఆడిన ప్రతి పెద్ద షాట్‌తో ప్రేక్షకులు ఆనందంతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే దిగ్గజ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా ధోనీ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యింది. 
 
ఈ మ్యాచ్‌లో, రోహిత్ శర్మ భీకర సెంచరీ సాధించాడు. అయితే అది ఫలించలేదు, ఎందుకంటే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
Dhoni
 
ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన బ్యాటింగ్‌కు సిక్సర్ల మోత మోగించడం చూసి షాక్ అయ్యింది. ఆ షాక్ నుంచి ఆమె తేరుకునేందుకు కొంత సమయం పట్టింది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments