రియో ఒలింపిక్స్లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా జోడీకి నిరాశే ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్లో సానియా - రోహన్ బోపన్నల జోడీ ఓటమి పాలయ్యింది. కనీసం క్యాంసం అయినా దక్కించుకుంటారని ఆశపడితే అక్కడా ఓడిపోయి..భారతీ క్రీడాభిమానులను నిరాశపర్చారు. దీంతో ఓటమి తట్టుకోలేక మ్యాచ్ కోల్పోయిన అనంతరం సానియా, రోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సానియా కంటతడి పెట్టుకుంది.
నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ వస్తాయని, మళ్లీ ఆడతానో లేదోనని, తనకు మాటలు రావడం లేదని సానియా కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఓటమి చాలా కష్టంగా ఉందని, కానీ అంగీకరించక తప్పదు అని మాట్లాడారు. 2004లో పేస్ - భూపతిల ఏథెన్స్ ఒలింపిక్స్ను గుర్తుకు తెచ్చిందన్నారు. టెన్నిస్ ప్లేయర్లకు అదృష్టం కలిసి రావాలని, దీని నుంచి బయట పడేందుకు కొంచెం సమయం కావాలని ఆమె అన్నారు. త్వరలో జరగనున్న డబ్ల్యూటీఏ పోరుకు సిద్ధమవుతామని వెల్లడించారు.