పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఫిక్సింగ్పై ఎట్టకేలకు నోరు విప్పాడు. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఒప్పేసుకున్నాడు.
2010లో ఇంగ్లాండ్తో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో తాను స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడమే కాక ఫిక్సింగ్లో పాల్గొనాలని జట్టు సభ్యులు మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమీర్లకు కూడా ఆదేశాలు జారీ చేశానని సల్మాన్ భట్ అంగీకరించాడు.
మొన్నటిదాకా తనకే పాపం తెలియదని చెబుతూ వస్తున్న భట్, తాజాగా పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్తో భేటీ సందర్భంగా తన నేరాన్ని అంగీకరించినట్లు పీసీబీ వెల్లడించింది.