Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితులకు సచిన్ అండ.. మిషన్ ఆక్సిజన్‌కు కోటి రూపాయలు

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:40 IST)
కరోనా బాధితులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అండగా నిలిచారు. కరోనా బాధితులకు సాయంగా మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్‌ కొరతతో బాధపడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకుగాను మిషన్‌ ఆక్సిజన్‌ అనే సంస్థకు తన వంతుగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని సచిన్‌ అందజేశారు.
 
ఈ విషయాన్ని స్వయంగా సచిన్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. 250 మందికి పైగా యువకులతో మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థ వైరస్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించేందుకు పనిచేస్తోంది. 
 
దేశంలో మొదటిసారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధానమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన సచిన్‌.. ప్రస్తుతం మరోసారి తన గొప్ప మనసు చాటుకోవడంతో సచిన్‌ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిగతా క్రికెటర్లు కూడా దేశం కోసం సాయం చేయాలంటూ.. మరికొందరు కామెంట్స్‌ ద్వారా కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments