Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత వికెట్ కీపర్ ఔదార్యం... ఉత్తరాఖండ్‌కు విరాళంగా మ్యాచ్ ఫీజు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:21 IST)
భారత క్రికెట్ జట్టులోని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మొన్నటికిమొన్న ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన ఈ కుర్రోడు.. ఇపుడు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ బాగా రాణిస్తున్నాడు. అదేసమయంలో తన ఔదార్యాన్ని చూపించారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు చరియలు విరిగిపడటంతో జలప్రళయం సంభవించింది. దీంతో గంగానది ఉపనది ధౌలతీగంగపై నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రం నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయింది. ఈ విపత్తులో 150మంది వరకు గల్లంతైనట్టు సమాచారం. 
 
తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్యక్తం చేస్తూ పంత్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. జలప్రళయం బాధితులను ఆదుకునేందుకు మరింతమంది ముందుకు రావాలని కోరుకుంటున్నానని రిషబ్ కోరారు. 
 
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-ఇంగ్లాండు జట్ల మధ్య జరిగిన ఓపెనింగ్ టెస్టులో రిషబ్ పంత్ 91 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ సహాయ చర్యల కోసం మొట్టమొదటి సారి విరాళం ప్రకటించిన రిషబ్ పంత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్ ఫోన్ కాల్‌ని లిఫ్ట్ చేయని ప్రధాని మోడి?, ట్రంప్ నెత్తిపైన టారిఫ్‌ల తాటికాయ

Army Choppers: రాత్రంతా పోరాడి వరదల్లో చిక్కుకున్న ఏడుగురు రైతులను కాపాడిన ఆర్మీ హెలికాప్టర్లు (video)

Andhra Pradesh: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో పెరుగుతున్న వరద నీరు

తెలంగాణాలో భారీ వర్షాలు - ఏకంగా 38 రైళ్లు రద్దు

కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments