Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనకు సాయం చేసిన వారికి థ్యాంక్స్ చెప్పిన రిషబ్ పంత్

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (11:34 IST)
రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనకు సాయం చేసిన ఇద్దరు వ్యక్తులకు భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్వయంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదంలో రిషబ్‌కు సాయపడటమే కాకుండా రిషబ్ పోగొట్టున్న వస్తువులను సేకరించి, వాటిని తిరిగి ఇచ్చేందుకు ఆస్పత్రికి ఆ ఇద్దరు వ్యక్తులైన రజత్ కుమార్, నిషు కుమార్‌లు వచ్చారు. 
 
వారు వచ్చిన విషయం తెలుసుకున్న రిషబ్ వారిని తాను చికత్స పొందుతున్న గదికి పిలిచి కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో తీసిన ఓ ఫోటోలో రిషబ్ చేయి కనిపిస్తుంది. ఇందులో రిషబ్ ముఖం కనిపించనప్పటికీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. 
 
కాగా, డిసెంబరు 31వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పలు ఆపరేషన్ల తర్వాత ఐసీయూ వార్డు నుంచి ప్రత్యేక వార్డుకు మార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments