Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా హృదయం ముక్కలైంది : రికీపాంటింగ్

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (17:35 IST)
న్యూజిలాండ్‌ దేశంలో క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో మారణహోమంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కోసం ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాంటింగ్.. మసీదులపై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించాడు. ఈ మారణహోమాన్ని చూసి తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఈ కాల్పులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ ఉన్మాది మారణకాండలో అసువులు బాసిన వారిని చూస్తే చాలా బాధగా ఉంది. ప్రాక్టీస్ కోసం బస్సులో బయల్దేరుతున్నప్పుడు కొంతమంది క్రికెటర్లు మొబైల్ ఫోన్లలో వీడియో క్లిప్పింగ్‌లను చూపించారు. వాటిని చూసేందుకు నేను ధైర్యం చేయలేకపోయా. ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు.
 
ఇలాంటి ఘటనలు న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్‌కే పరిమితమవుతాయనుకోవడం లేదు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లోనూ జరిగే అవకాశముంది. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. అాగే, ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతిచేకూరాలని ఆ దేవాన్ని ప్రార్థిస్తున్నా అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments