Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి బంతికి సిక్స్ కొట్టి గెలుపును సొంతం చేసుకున్న బెంగుళూరు

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (12:01 IST)
ఐపీఎల్ 14వ సీజన్ పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మరో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజయభేరీ మోగించింది. చివరి బంతికి సిక్స్ కొట్టి అనూహ్యంగా గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఓడినప్పటికీ దాని స్థానంలో ఎలాంటి మార్పు లేదు. అలాగే, ఆర్సీబీ జట్టు స్థానంలో కూడా మార్పు లేదు. ఢిల్లీ 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరు 18 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పృథ్వీషా 48, ధావన్ 43, పంత్ 10, శ్రేయాస్ అయ్యర్ 18, హెట్‌‌మెయిర్ 29 పరుగులు చేశారు. అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
 
అయితే, మ్యాచ్ చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియక ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 15 పరుగులు అవసరం. అవేశ్ ఖాన్ తొలి ఐదు బంతుల్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఇక బెంగళూరు ఓటమి ఖాయమని అనుకున్నారు.
 
అయితే, అప్పుడే అద్భుతం జరిగింది. చివరి బంతిని వైడ్‌గా వేయడం బెంగళూరుకు కలిసొచ్చింది. ఆ తర్వాతి బంతిని శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టడంతో బెంగళూరు జట్టు సంబరాల్లో మునిగిపోయింది. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసిన భరత్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. డివిలియర్స్ 26, మ్యాక్స్‌వెల్ 51 పరుగులు చేశారు. ఇక ప్లే ఆఫ్స్‌లో బెంగళూరు జట్టు కోల్‌కతా తలపడనుండగా, టాప్-2 జట్లు అయిన ఢిల్లీ, చెన్నై తలపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెల్ఫీ వీడియో కోసం వాటర్ ఫాల్స్‌‍లో దూకిన మాజీ ఆర్మీ జవాన్.. రెండు తర్వాత... (Video)

డెంగ్యూ జ్వరాన్ని పోలి వుండే జికా వైరస్.. గర్భిణీ మహిళలు జాగ్రత్త!

జూలై 6 నుంచి జూలై 19 వరకు పూరీ జగన్నాథుడి రథయాత్ర!!

ప్రజలు చిత్తుగా ఓడించినా సరే మూడు రాజధానులకే కట్టుబడివున్నాం : బొత్స సత్తిబాబు

బెంగళూరు: డెంగ్యూ జ్వరంతో 27 ఏళ్ల యువకుడి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

శ్రీరామ్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కథతో కోడి బుర్ర ప్రారంభం

ఆసక్తిగా మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది బ‌ర్త్‌డే బాయ్ టీజ‌ర్

తర్వాతి కథనం
Show comments